నా తొలి ఉద్యోగంలో ఒక విధంగా పి.వి.ఆర్.కే.ప్రసాద్ గారి క్రిందే పని చేయటం జరిగింది. అయినా ఆయన పేరు వినటమే కానీ వారిని కలవటం కానీ చూడటం కానీ జరగలేదు. అక్కడ చేస్తున్నప్పుడే ‘ఐఏఎస్’ అధికారులని, వారి(ప్రభుత్వ) పని తీరుని దగ్గరి నుండి గమనించే అవకాశం లభించింది. నిస్సందేహంగా అందరూ మేధావులే. నేను చూసినంతలో ఎక్కువ మంది రాజకీయ క్రీడ(పదవుల పైరవీలు, పై వారి మెప్పు కోసం ప్రాకులాడటం, చంచాగిరి) లో మునిగి తేలుతూ ఉండే వారు. కొద్ది మంది నిజంగా ప్రజలకు ఏదో చెయ్యాలని తహ తహ లాడుతూ రాత్రి పగలు కష్ట పడే వారు. ఆ కోవకి చెందిన శ్రీ పి.వి.ఆర్.కే.ప్రసాద్ గారు ఒక ‘ఐఏఎస్’ అధికారిగా తన ౩౫ సంవత్సారాల అనుభవాలను ఈ పుస్తకం ద్వారా మనతో పంచుకున్నారు. ఎందరో రాష్ట్ర ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవాలు ఒక ఎత్తు అయితే మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి తో పని చేసిన అనుభవాలు ఒక ఎత్తు. పి.వి. గారి హయాంలో జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలు, వారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు ఎలా ఏ నేపధ్యం లో తీసుకో వలసి వచ్చిందో, వారి చివరి రోజులు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. తప్పక చదవవలిసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని అందంగా తీర్చి దిద్దిన ఎమెస్కో వారికి అభినందనలు.
డిసెంబరు 12, 2010
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI








